
రాగం :- బృందావన సారంగ
అన్నమాచార్య సంకీర్తన
ఎంత మాత్రమున యెవ్వరు తలచిన అంత మాత్రమేనీవు
అంతరాంతరము లెంచి చూడ పిండంతె నిప్పటి అన్నట్టు
కొలుతురు మిము వైష్ణవులు కూరిమితొ విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మాం బనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడనుచు
సరినన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు
దరశనములు మిము నానావిధులను తలపుల కొలదుల భజింతురు
సిరుల మిము యె అల్పబుద్ధి తలచిన వారికి అల్పం బవుదువు
గరిమల మిము యె ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగిరథి దరిబావుల ఆ జలమే ఊరిన ఎట్లు
శ్రీవెంకటపతి నీవయితె మము చేకొని ఉన్న దైవము
శ్రీవెంకటపతి నీవయితె మము చేకొని ఉన్న దైవమని
ఈ బలదె నీ శరనమని యెదను ఇదియె పరతత్వము నాకు
No comments:
Post a Comment